రాష్ట్రంలో నెలకొన్నఅనిశ్చితి రోజురోజుకు పెరిగిపోయింది. రోశయ్య ముఖ్యమంత్రి బాద్యతలు తీసుకున్న రోజునుంచి రాష్ట్రం అతలాకుతలమయ్యింది . సామాన్యంగా ఇలాంటి పరిస్తితులను ప్రతిపక్షాలు ఒక అవకాశంగా తీసుకుంటాయి. అవకాశం దొరికిన ప్రతిసారి మీడియా ముందు విమర్శలు కురిపిస్తాయి .ఈ పరిస్తితుల్లో ఎవరికైనా సొంతపార్టీ నుంచి బలమైన సపోర్ట్ అవసరం. కానీ గత 14 నెలలూ రోశయ్యకు ప్రతిపక్షం కన్నా సొంత పార్టీ నుంచే ఎక్కువ ఇబ్బందులెదురయ్యాయన్నది వాస్తవం. సహజంగా మెతక స్వభావంగల రోశయ్య వీటిని ఎదిరించే సాహసం చేయలేదు . సమస్యలను కంట్రోల్ చేయడానికి ముఖ్యమంత్రి మార్పు అవసరమే అన్నది విశ్లేషకుల అబిప్రాయం .
Thursday, November 25, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment