Thursday, November 25, 2010

ఉత్కంటలో రాష్ట్రరాజకీయాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని రాజకీయాలు వేగంగా  మారిపోయాయి. మంగళవారం (23.11.2010) మాజీ  ముఖ్యమంత్రి  రోశయ్య  డిల్లీకి వెళ్ళడం, బుదవారం మద్యాహ్నం -24.11.2010 రాజీనామా సమర్పించడం , అదే రోజు సాయంత్రం  7గంటలకు అసెంబ్లీలో CLP సమావేశం, డిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  హై కమాండ్ ప్రణబ్ ముఖర్జీ , గులంనబి ఆజాద్, A.K అంటోనీ తదితరులు రోశయ్యకి  కృతఙ్ఞతలు, కొత్త ముఖ్యమంత్రి నిర్ణయం సోనియాకె ఇస్తున్నట్లు రెండు ఏక వాక్య తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదింపచేయడం, మూడు గంటలు గడవక ముందే అంటే సుమారు రాత్రి 10 గంటలకే  ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఆమోదించడం చకచకా  జరిగి పోయాయి.

No comments:

Post a Comment